నేను మొన్న ఒకసారి తెలుగు బ్లాగులు తిరగేస్తుంటే ఈ "ఎన్నేల్లో గోదారి" కథ కనిపించి చదివాను. ఈ కథ నా మనసుని కలచి వేసింది నిజమే గోదారి చూడటానికి చాల చక్కగా వుంటుంది కాని ఇలాంటివి చూసినపుడు, చదివినప్పుడు అందమైన గోదారి లో కూడా ఇలాంటి క్రూరమైన సంఘటనలు వున్నాయని తలచుకుంటేనే చాలా బాధగా వుంటుంది.
కానీ వేణు వేదం గారు రాసిన ఈ కథ నిజమో కాదో నాకు తెలియదు కానీ ఆ కథలో చాలా బాధ నిరాశ నిస్పృహ కనిపించాయి. కానీ ఎవరికి ఎలా రాసిపెట్టి వుందో ఎవరికి తెలియదు కదా!.
కాని ఈ కథ లో చివరి లైన్ కి అర్ధం తెలియలేదు. " సరదాగా పారే గోదారి... ఎంత మంది శత్రువులున్నారో తెలియదుగానీ వారి సంఖ్య రెండు కంటే ఎక్కువని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను."
దయ చేసి ఎవరికైనా ఈ లైన్ కి అర్ధం తెలిస్తే నాకు కూడా తెలియజేయగలరు.
మూలం : http://teluguplaty.blogspot.com/